Skip to main content

2029లో జగనన్న ముఖ్యమంత్రి చేసేందుకు అందరం సమిష్టిగా కృషిచేయాలి : పాటి శివకుమార్ రాజోలు నియోజకవర్గ స్థాయి వైఎస్ ఆర్ పార్టీ శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం.

రాజోలు, విశాఖ సందేసం....వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ అద్యక్షతన సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో పాటి శివకుమార్ స్వగృహం  వద్ద నియోజకవర్గ స్థాయి  వైసీపీ శెట్టిబలిజ నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా శివకుమార్ మాట్లాడుతూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారు స్వర్గీయవైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వైస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని శెట్టిబలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ సమావేశంలో అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీ బలోపేతానికి పనిచేయాలని, 2029 లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేవరకు అందరం సమిష్టిగా కృషిచేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గుబ్బల మనోహర్ , రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గుబ్బల రమేష్,జిల్లా వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు దొంగ యేసు,నియోజకవర్గ బి సి సెల్ అద్యక్షులు గుబ్బల సత్యనారాయణ, రాజోలు మండలపార్టీ అద్యక్షులు కట్టా శ్రీనివాస్,జిల్లా వైసీపీ బీసీ సెల్ కార్యదర్శి చెల్లుబోయిన రాంబాబు,రామేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షులు ఇళ్ల శ్రీను, మాజీ ఎంపీటీసీ చెల్లింగి నాగరాజు,మలికిపురం మాజీ సొసైటీ అధ్యక్షులు చెల్లుబోయిన బుచ్చియ్య,శృంగవరప్పాడు  మాజీ సర్పంచ్ దొంగ సత్యనారాయణ,మాజీ ఏఎంసి గుబ్బల రోజారమణి , మాజీ రాజోలు వైస్ ఎంపీపీ కంచి వెంకట రమణ, కుడిపూడి రాంబాబు, యాండ్ర రాంబాబు, గుబ్బల సింహాచలం,గుబ్బల రమేష్, పిల్లి అంజి,బైరిశెట్టి నరశింహరావు,చెల్లుబోయిన శేఖర్,చుట్టూరి గణేశ్వరావు,గుబ్బల త్రిమూర్తులు,కడలి రఘు, కట్టా శ్రీను,పిల్లి హర్ష, పాటి కిషోర్, పిల్లి భార్గవ్,గుబ్బల మణికంఠ,పెచెట్టి సుదీర్,గుబ్బల గోపాలం, పెచెట్టి ప్రసాద్, గుబ్బల సురేష్,బొక్క నారాయణాయరావు,చెల్లుబోయిన వెంకటేశ్వర్రావు,మామిడిశెట్టి బాబీ, చింతపల్లి సురేష్,పాటి శివదానష్,కడలి ఫణి, గుబ్బల ఆదిత్య, చెల్లుబోయిన జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...