జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 23.03.2026
ఈరోజు అనగా తేది 23.03.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారి అధ్యక్షతన ఏప్రిల్ 20 న జరుగబోవు చందనోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు, అంబులన్స్లు మొదలగునవి సమన్వయపరిచి సమకూర్చడం జరిగింది. స్పెషలిస్ట్ డాక్టర్స్, స్టాఫ్ నర్స్లు, ఫార్మసిస్ట్లు, ఆశా కార్యకర్తలు, ఎ.ఎన్.ఎం లు, సూపర్ వైజర్ సిబ్బంది వీరందరినీ పర్యవేక్షించుటకు 10 మంది వరకు 3 షిఫ్ట్ లు వేయడం జరిగింది. మొత్తం సిబ్బంది 304 మంది డిప్యుటేషన్, 90 అంబులన్స్లు 2 షిఫ్ట్ లలో, కంట్రోల్ రూమ్ సిబ్బంది 12 మంది, రెఫరల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్, గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం, కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా జనరల్ హాస్పిటల్, సిబ్బంది 3 షిఫ్ట్ లు, 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు కొండ పైన అందుబాటులో కలరని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు తెలియచేసారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment