కూటమి ప్రభుత్వం దృష్టికి* *మరోసారి జర్నలిస్టులు పెండింగ్ సమస్యలు* *మార్చి 4న భారీ ర్యాలీ... మంత్రులు సమక్షంలో సభ* *అందరి సహకారంతో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం* *రేపు చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం*
ప్రముఖుల పేరుతో ఉన్న అవార్డులు అందజేయాలని.. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని..
జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలని..
కార్మిక భీమా సదుపాయం కల్పించాలని .. మొత్తం
11 డిమాండ్లతో ఇప్పటికే తాము దశల వారీగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో మరోసారి వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందన్నారు.*రేపు చలో విజయవాడ*
వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4 న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్లులు పి.నారాయణలు తెలిపారు. ఆరోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని క్రమేపీ అది సభగా మారుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జర్నలిస్టుల సభకు అతిధులుగా రాష్ర్ట సమాచార,పౌరసంబందాల శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మంత్రులు హాజరుకానున్న ఈ సభలో జర్నలిస్టుల సమస్యలు వివరించి వాటి పరిష్కారాన్ని కోరుతామన్నారు. కావున రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు రవికుమార్, ప్రసాద్ ఉపాధ్యక్షులు ఎన్ రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి గణేష్ రెడ్డి, నగేష్ బాబు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవత్రినాథ్, కార్యదర్శిలు శేషు, నేల రాజు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్,కార్యదర్శి బొబ్బర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్,శర్మ, జగన్నాథం,హరి



Comments
Post a Comment