Skip to main content

కువైట్‌లో టిడిపి రక్తదాన శిబిరానికి భారీ స్పందన… కార్యకర్తల సేవాభావాన్ని కొనియాడిన పల్లా* *▪️ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరగనున్న టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… ఎన్టీఆర్ ఆశయాలకు ప్రపంచవ్యాప్త గౌరవం* *-- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

 అమరావతి, మార్చి 28:* తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కువైట్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి లభించిన విశేష స్పందనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు హర్షం వ్యక్తం చేశారు. సేవాభావంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం పార్టీ విలువలకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ కుదరవల్లి సుధాకరరావు గారిని, ఎన్నారై టిడిపి సెల్ మరియు ఏపీ ఎన్నార్టీ ప్రెసిడెంట్ శ్రీ  రవి వేమూరు, ఎన్నారై టిడిపి సెల్ సెంట్రల్ ఆఫీస్ కోఆర్డినేటర్ శ్రీ చప్పిడి రాజశేఖర్ మరియు ఎన్నారై టిడిపి గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ రావి రాధాకృష్ణ గార్లను ప్రత్యేకంగా అభినందించారు.


ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సామాజిక న్యాయమే లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడనున్నట్లు తెలిపారు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు సుమారు 90 దేశాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా, అమెరికాలో 25 పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాల్లో, అలాగే యూరప్ దేశాలు, యూకే, సింగపూర్, మలేషియా, ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు.


విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ గారి ఆశయాలను విశ్వవ్యాప్తంగా చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ, ఇది పార్టీ విస్తృతి, విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ గారు ప్రతిష్టించిన ఆత్మగౌరవ భావజాలం నేడు దేశ విదేశాల్లో బలంగా పాతుకుపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుండగా, యువ నాయకత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషి టిడిపికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తోందని పల్లా గారు పేర్కొన్నారు. అనుభవం–యువశక్తి కలయికతో పార్టీ భవిష్యత్తు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...