Skip to main content

వార్డు–79 లో రూ.3.91 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.

విశాఖపట్నం, మార్చి 1: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అగనంపూడి జోన్ ,వార్డు–79 లో దేశపాత్రునిపాలెం లో రూ.3.91 కోట్ల అంచనా వ్యయంతో 16 అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముందుగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరు కావడం జరిగింది అన్నారు. నగరంలో రహదారులు, కాలువలు, పారిశుధ్య సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా జీవీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

అగనంపూడి జోన్ వార్డు-79 లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టులు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం 16 పనులు సుమారు రూ.391.52 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా
• జాజులవానిపాలెం ప్రాంతంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.34.20 లక్షలు
• సముదాయ భవనం వద్ద షెడ్, కాంపౌండ్ వాల్ మరియు ఇతర సౌకర్యాల ఏర్పాటు – రూ.19.76 లక్షలు
• అంబేద్కర్ వీధి సమీపంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.19.40 లక్షలు
• ఎస్‌.ఎస్‌. 2B-8 సమీపంలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్లు నిర్మాణం – రూ.19.89 లక్షలు
• జీఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.90 లక్షలు
• వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టులు నిర్మాణం – రూ.19.96 లక్షలు
• శ్మశానవాటిక వద్ద బర్నింగ్ ప్లాట్‌ఫామ్, కాంపౌండ్ వాల్ తదితర సదుపాయాల ఏర్పాటు – రూ.32.72 లక్షలు
• వివిధ కాలనీలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టులు నిర్మాణం – రూ.38.92 లక్షలు
• దేశు సత్యనారాయణ గారి ఇంటి సమీపంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.96 లక్షలు
• శ్రీనివాస నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.68 లక్షలు
• బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.79 లక్షలు
• ఎస్‌.ఎస్‌.2B నుండి ఇతర ప్రాంతాల వరకు సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.92 లక్షలు
• బాలాజీ నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.82 లక్షలు
• బొమ్మరిల్లు ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.66 లక్షలు
• ఎస్‌.ఎస్‌.33 ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం – రూ.19.79 లక్షలు
• వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మాణం – రూ.48.15 లక్షలు
ఈ పనులు పూర్తయిన తరువాత ఆయా ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మేయర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి, జివీఎంసీ.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...