Skip to main content

సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు సువర్ణ అవకాశం... 8వ తేదిన రామచంద్రపురంలో నిరుద్యోగ మహిళలకు భారీ జాబ్ మేళా....

రామచంద్రపురం, విశాఖ సందేసం....అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో నిరుద్యోగ మహిళల కోసం ప్రత్యేకంగా భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఈ కార్యక్రమం జరగనుందని మంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రామచంద్రపురం మెయిన్ రోడ్డులోని ఆర్డీవో ఆఫీస్ పక్కన, లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న టౌన్ హాల్‌లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేళాలో జాతీయ స్థాయి కార్పొరేట్ కంపెనీలతో పాటు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో స్థానికంగా పనిచేసేందుకు వందలాది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

కార్పొరేట్ కంపెనీల్లో అవకాశాలు (వార్షిక వేతనం రూ. 1.8 లక్షల నుంచి 2.4 లక్షలు):

అర్హతలు: 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండి.. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన స్త్రీ అభ్యర్థులు అర్హులు.

కంపెనీలు: టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, విస్ట్రన్, రేమండ్స్, మదర్సన్, టీసీఎల్, నియో లింక్, ఫాక్స్ లింక్.

పనిచేయాల్సిన ప్రాంతాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరుపతి.

స్థానికంగా ఉపాధి అవకాశాలు (నెలసరి వేతనం రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు):

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, మండపేట, రామచంద్రపురం) పరిధిలో పనిచేయడానికి పలు లోకల్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వివరాలు:

కిమ్స్ హాస్పిటల్ : 25 ఏళ్ల లోపు వయసు, టెన్త్ చదివి జీడీఏ సర్టిఫికెట్ ఉన్నవారికి 'జీడీఏ అసిస్టెంట్' పోస్టులు. 30 ఏళ్ల లోపు ఉండి జీఎన్‌ఎం , బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి 'స్టాఫ్ నర్స్' పోస్టులు.

షాపింగ్ మాల్స్: 30 ఏళ్ల లోపు వయసు ఉండి టెన్త్ చదివిన వారు మోర్, విజేత, విశాల్, డి-మార్ట్, విక్టరీ బజార్, వసుధ, క్రోమా, ట్రెండ్స్ వంటి మాల్స్‌లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అపోలో ఫార్మసీ: 35 ఏళ్ల లోపు వయసుండి బీ-ఫార్మసీ, డి-ఫార్మసీ చదివిన వారు ఫార్మసిస్టు పోస్టులకు అర్హులు.

పెట్రోల్ బంకులు: 50 ఏళ్ల లోపు వయసు ఉండి కనీసం 10వ తరగతి చదివిన మహిళలు.. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ రిటైల్ పెట్రోల్ బంకుల్లో కస్టమర్ అటెండెంట్‌గా పని చేయడానికి ఇంటర్వ్యూకు హాజరుకావచ్చునని తెలియజేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...