Skip to main content

జవాన్ నాగబాబు సేవలు మరువలేనివి : ఎంపీ హరీష్ మాధుర్..... అమర జవాన్ నాగబాబుకు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఘన నివాళి...

అల్లవరం, విశాఖ సందేసం...దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అమర జవాన్ బడుగు నాగబాబు సేవలు చిరస్మరణీయమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ (బాలయోగి) కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన నాగబాబు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో నిర్వహించిన నాగబాబు సంతాన సభలో  ఎంపీ హరీష్ మాధుర్ పాల్గొని  జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాగబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమారు 24 ఏళ్ల పాటు భారత సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన నాగబాబు మృతి చెందడం కోనసీమ ప్రాంతానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నాగబాబు కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో, దేశానికి సుదీర్ఘ కాలం సేవలందించిన జవాన్‌కు అంత్యక్రియల సమయంలో దక్కాల్సిన అధికార లాంఛనాలు, గౌరవ వందనం విషయంలో జరిగిన జాప్యంపై ఎంపీ హరీష్ మాధుర్ అసహనం వ్యక్తం చేశారు. సైనికుల పట్ల గౌరవం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరావు, గంధం పల్లంరాజు,   స్థానిక నాయకులు, జనసేన, టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమర జవాన్‌కు నివాళులు అర్పించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...