Skip to main content

మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది రబీలో రికార్డు స్థాయిలో సుమారు 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని, దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధరలు పతనమయ్యాయని వివరించారు. క్వింటాల్‌కు రూ.2,400 కనీస మద్దతు ధర ఉండగా, మార్కెట్‌లో కేవలం రూ.1,500 నుంచి రూ.1,700 మాత్రమే లభిస్తోందని, దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

మంత్రి నివేదికపై స్పందించిన చంద్రబాబు, రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీకి ప్రత్యేకంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ పథకాన్ని అమలు చేయాలని లేఖలో కోరారు. ఈ పథకం కింద అయ్యే నష్టాన్ని పూర్తిగా (100శాతం) కేంద్ర ప్రభుత్వమే భరించాలని, మొత్తం ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...