అయ్యరక జాతీయ మహిళా శక్తి ఉగాది పురస్కారాలు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయ్యరక జాతీయ ప్రధాన కార్యదర్శి పేదిరెట్ల రాజశేఖర్ పాల్గొన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు అధ్యక్షతన అయ్యరక జాతీయుల్లో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేస్తూ నిరంతరం సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న
మహిళలను ముఖ్య అతిథులు కుల పెద్దల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాది కర్రీ స్వాతి లత ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి లత మాట్లాడుతూ మొదటి ఉపాధ్యాయునురాలిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితిలో నిలబెట్టే అదృష్టం భగవంతుని కల్పించాడని, న్యాయవాద వృత్తిలో కూడా ఎంతోమంది పేద మహిళలకు సేవ చేసే అదృష్టం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.
భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో అయ్యరక జాతికి గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని,తనను గుర్తించి సత్కరించడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.చక్కటి గౌరవాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.తనను ప్రోత్సహిస్తున్న భర్త కరి నారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలను ముఖ్య అతిథులు కుల పెద్దల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాది కర్రీ స్వాతి లత ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి లత మాట్లాడుతూ మొదటి ఉపాధ్యాయునురాలిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితిలో నిలబెట్టే అదృష్టం భగవంతుని కల్పించాడని, న్యాయవాద వృత్తిలో కూడా ఎంతోమంది పేద మహిళలకు సేవ చేసే అదృష్టం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.
భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో అయ్యరక జాతికి గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని,తనను గుర్తించి సత్కరించడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.చక్కటి గౌరవాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.తనను ప్రోత్సహిస్తున్న భర్త కరి నారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments
Post a Comment