Skip to main content

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ చింతా అనురాధ కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువు......

 అల్లవరం, విశాఖ సందేసం...అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ లోని అక్కాచెల్లెమ్మలకు నిజమైన సాధికారత లభించేలా చిత్తశుద్ధితో వ్యవహరించాలని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  చింతా అనురాధ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలతో ఒక వెలుగు వెలిగిన సోదరీమణులు ఇప్పుడు చిన్నబోతున్నారని ఆమె పేర్కొంటూ, మహిళల కోసం ప్రధానంగా వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, అమ్మఒడి, సున్నా వడ్డీ, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ ఇబీసీ  నేస్తం, విద్యా,  వసతి దీవెన వంటి పథకాలే కాకుండా పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలతో లక్షలాది మంది మహిళలకు సొంత ఆస్తిని అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేసారు. కోట్లాది మంది అక్కచెల్లెమ్మలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  నేరుగా తమ ఖాతాల్లోకి సుమారు ₹1.89 లక్షల కోట్లు వేశారని కానీ నేటి కూటమి ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అనురాధ  పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదర కొట్టి బాబు  ఇప్పటి వరకూ, 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్‌, సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షల చొప్పున రుణాల ఊసు ఎత్తడం లేదని, అరకొర పథకాలు అమలు చేస్తూ ఎంతసేపు ప్రచార ఆర్భాటంతో గడుపుతున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. మరో పక్కన వైయస్ జగన్ మోహన్ రెడ్డి  సొంత సోదరుడిలా అండగా నిలబడి మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశా చట్టం, దిశా యాప్ మొదలైన వాటికి  చంద్రబాబు నాయుడు   తూట్లు పొడిచారని, అందుకే రాష్ట్రం మొత్తంలో మహిళలపై గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యాచారాలు, దాడులు పెరిగిపోయిన విషయాన్ని అనురాధ  దుయ్యబట్టారు. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అత్యవసర సేవలను కూడా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, మహిళల సంక్షేమానికి మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని చింతా అనురాధ  కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...