వసుదైక కుటుంబానికి నిదర్శనంగా ఏయూ - ఐక్యత, వైవిధ్యతలు మన బలం - శాంతి, సుస్థిరతకు యువత పాటు పడాలి
ఏయూ అత్య్తుత్త నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తోందన్నారు. ప్రపంచం నేడు అనుసంధానించబడిందని, విభిన్న దేశాల సంస్కృతులు పంచుకుంటూ, సామరస్య జీవనం సాగించాలన్నారు.అంతర్జాతీయ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా దీనిని తీర్చిదిద్దిన ఏయూ అధికారులను అభినందించారు. నృత్యం, సంగీతం, కలలకు నిదర్శనంగా ఈ వేదిక నిలవాలని ఆకాంక్షించారు.ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అదే విధంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవానికి సైతం మంచి ఆదరణ లభిస్తోందన్నారు. విద్యార్థులు తమ కళలను, సాంస్కృతిక ప్రదర్శనలు అందిస్తారన్నారు.
అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ 57 దేశాలకు చెందిన 1150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యశిస్తున్నారన్నారు. కార్యక్రమంలోఅసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం యుగంధర్, ఆచార్య విజయశాంతి, పలువురు ఆచార్యులు, డీన్లు, 
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంరతం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలు, నృత్య రీతులను పరిచయం చేస్తూ నిర్వహిచిన కార్యక్రమం ఆద్యంతం అలరించింది



Comments
Post a Comment