Skip to main content

కొమరగిరిపట్నంలో తాగునిటి సరఫరాకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.... జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి....

విశాఖ సందేసం....అల్లవరం మండలం  మేజర్  కొమరగిరిపట్నం పంచాయతీ  ప్రజలకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా  తాగునీటిని పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నామంటూ 

డా. బియర్  అంబేద్కర్ కోనసీమ జిల్లా రావిరాల మహేష్ కుమార్ కు సోమవారం  కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ  సర్పంచ్  రాకాపు విజయలక్ష్మీ  ఫిర్యాదు చేశారు. కొమరగిరిపట్నం గ్రామపంచాయితీ పరిదిలో  పి డబ్ల్యూ ఎస్  మంచినీటి చెరువు అభివృద్ధి పనుల దృష్ట్యా గత సంవత్సరం చెరువు నీటిని  ఆరగట్టి కాంట్రాక్టరకు  అప్పగించటం జరిగిందని, అప్పటి నుండి పంట కాలువ ద్వారా మంచినీటిని ఫిల్టరింగ్ చేసి మంచినీటిని గ్రామ ప్రజలకు  సరఫరా చేస్తున్నామన్నారు. ఓ హెచ్ ఎస్ ఆర్   ట్యాంకు నుండి మంచినీటి కుళాయి చెరువునకు వెళ్ళే 3 ఫేస్  కేబుల్ మోంథా తుఫాన్ దృష్ట్యా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు  ఎక్కడికక్కడ కట్ చేయటం వలన మంచినీటి కుళాయి చెరువు దగ్గర 10 హెచ్ పి   మోటార్లు పని  చేయుటకు వీలు పడటం లేదని,  ఈ సమస్యపై  ఎన్నిసార్లు  ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులకు  తెలియపరచియున్నప్పటికీ  స్పందించడంలేదని అన్నారు. ఓ హెచ్ ఎస్ ఆర్   ట్యాంకు నుండి మంచినీటి కుళాయి చెరువునకు వెళ్ళే 3 ఫేస్  కేబుల్ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సర్పంచ్ విజయలక్ష్మి కోరారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...