బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 23-03-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పొలిమేర శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ తిప్పనబోయిన కోటేశ్వర రావు, బీజేపీ జిల్లా కార్యదర్శి కంటుభుక్త సునీత మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment