జాతీయ ఉపాధి హామీ పధకం నిర్వీర్యంపై కాంగ్రెస్ పోరాటం ఆగదు : రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన షర్మిల రెడ్డి
షర్మిల రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావడం ఖాయమని, దేశంలోనూ రాష్ట్రంలోనూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారి యొక్క ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ ప్రజల సమస్యలను అమలాపురం కమిషనర్, జిల్లా కలెక్టర్ దృష్టికి ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజలకు అవసరమయ్యే పనులను సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు మాట్లాడుతూ పెన్షన్ లేవని, తాగు నీరు సరిగా అందడం లేదని వృద్ధులైన మమ్మల్ని పట్టించుకోవడంలేదని అనేక సమస్యలు షర్మిల దృష్టికి తీసుకురాగా వైయస్ షర్మిల రెడ్డి విధంగా కలెక్టర్ తో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోఆర్డినేటర్లు ఇన్చార్జిలు కార్యకర్తలు నాయకులు ఏ.ఐ.సి.సి మెంబర్ బి ఆర్ కే నాయుడు,జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్ అయితాబత్తుల సుభాషిని,అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి,మండల అధ్యక్షులు పోలిశెట్టి హరిబాబు,అప్పన రామ కృష్ణ, ఏలేశ్వరం రాధాకృష్ణ, బీ.సీ నాయకులు కుడుపూడి శ్రీనివాస్, ముషిణి రామకృష్ణారావు,ధోనిపాటి విజయలక్ష్మి,మహబూబ్ షకిలా, మాచవరపు శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment