Skip to main content

ఐ.ఎస్.ఓ గుర్తింపు సాధించిన కొమరగిరిపట్నం పంచాయతీకి అభినందనలు: మాజీ ఎంపీ చింతా అనురాధ... సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి సత్కరించిన మాజీ ఎంపీ

 

అల్లవరం, విశాఖ సందేసం....ఐ.ఎస్.ఓ  గుర్తింపు సాధించిన కొమరగిరిపట్నం  గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి ను  అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ సోమవారం  ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మికి  పూలదండలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల(ఐఎస్ఓ) ధ్రువీకరణ పత్రం కోసం ఎంపిక చేయగా,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఈ ప్రతిష్టాత్మక ఐ ఎస్ ఓ ధ్రువీకరణ పత్రం లభించడం చాలా గర్వకారణమని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి, పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్లే ఐ.ఎస్.ఓ  గుర్తింపు సాధ్యమైందని ఎంపీ  పేర్కొన్నారు.ఇలాంటి విజయాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, గ్రామ పంచాయతీ  సిబ్బందిని మాజీ ఎంపీ  అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, బెండమూర్లంక సర్పంచ్ బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...