Skip to main content

ఉత్తర నియోజకవర్గంలో మహా ప్రశిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం, మార్చి 22:ఉత్తర నియోజకవర్గంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యయ మహా ప్రశిక్షణ కార్యక్రమం ఆదివారం ద్వారకానగర్‌లోని బివికె కాలేజీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన తో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు శిక్షణలో చెప్పే అంశాలను శ్రద్ధగా అవగాహనా చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీలోని నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలతో సత్సంబంధాలు మెరుగు పరచు కోవాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే గారు కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిత్రపటాల ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. పార్టీ గొప్పతనాన్ని ప్రతిబింబించే ఫోటోలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్  కార్యకర్తలను విశేషం గా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు, బుద్ధ లక్ష్మీనారాయణ, సుహాసిని ఆనంద్, విజయనంద్ రెడ్డి, కేశవ కాంత్, సురేష్ బాబు, పుట్ట గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.      

                  D.S.Varma Sr Sub EDITOR 


                

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...