Skip to main content

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు - అనంతరం పోలమాంబ అమ్మవారికి చీర సారె సమర్పణ*

ఈరోజు 19-03-2026 గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు అధ్యక్షతన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ఉగాది యొక్క విశిష్టతను వివరిస్తూ  మాట్లాడుతూ ప్రజలందరికి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపుతూ ఉగాది మన తెలుగువారందరికీ తొలి పండుగ అని అన్నారు. ఈ రోజున ఏదైనా ఒకమంచి పనిని మొదలుపెడితే సంవత్సరమంతా ప్రతి పని దిగ్విజయంగా నెరవేరుతాయని ప్రజలందరికి నమ్మకమని తెలిపారు.

  అదేవిధంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు పంచాంగ పఠనం చేయగా పార్టీ నాయకులూ కార్యకర్తలందరు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

అనంతరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద వాల్తేరు లో ఉన్న పోలమాంబ అమ్మవారికి బీజేపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఊరేగింపుగా మేళతాళాలతో వెళ్లి చీర సారె ను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, BJP రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ A కేశవకాంత్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జ్ బోండాడ నరేంద్ర ప్రకాశ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా కొమరగిరి సుహాసిని ఆనంద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్ మరియు జిల్లా పదాధికారులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...