గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి వాసంశెట్టి సుభాష్.... ఏపీ ఎన్ ఆర్ టి సి హెల్ప్లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని భరోసా...
ఇజ్రాయిల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు,ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారికి భరోసా కల్పించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్.ఆర్.ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు Andhra Pradesh Non-Resident Telugu Society (APNRTS)
ఈమెయిల్: helpline@apnrts.com లకు, 24/7 హెల్ప్ లైన్, +918500027678 వాట్సాప్ ద్వారా సమాచారం అందించ వచ్చునన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులందరూ ఆందోళన చెందకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రతినిధి బొంతు నాగరాజు సంక్షోభ సమయంలో తమతో ప్రత్యక్షంగా మాట్లాడి ధైర్యం చెప్పినందుకు ప్రత్యేకంగా అభినందించారు. కార్మికుల పట్ల మంత్రి సుభాష్ కున్న చిత్తశుద్ధిని ప్రస్తుతించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments
Post a Comment