ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని రక్షక దేవతగా విశాఖ వాసులు కొలుస్తారని విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు
ఈ కార్యక్రమానికి అతిధిగా సీతంరాజు సుధాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డన చేసారు. ఈ సందర్భంగా సీతంరాజు మాట్లాడుతూ భక్తుల కోరికలను తీర్చే శక్తి స్వరూపిణిగా, స్థానికులకు ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఎల్లమ్మ అమ్మవారి పురాతన దేవాలయం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్,ఎల్లమ్మ యువజన సంఘం సభ్యులు ఎల్లాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment