సెయింట్ జోసెఫ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మరియు బోటనీ అధ్యాపకురాలు సిస్టర్ హేమకు బోటనీలో వరి మరియు కాఫీ తొక్కలను సేంద్రియ ఎరువులుగా బయోకన్వర్షన్ చేయడం మరియు మొక్కల పెరుగుదల, మరియు నేల సారంపై వాటి ప్రభావం అంశం పై తన పరిశోధన ని కోయంబత్తూరు అవినాశిలింగం డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎ. విజయలక్ష్మి మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు. మార్చి 27న అవినాశిలింగం డీమ్డ్ యూనివర్సిటీలో ఆమెకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయబడింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేజ్ ప్రిన్సిపల్, యాజమాన్యం మరియు అధ్యాపకులు ఆమెను అభినందించారు. సంస్థ ఆమె సాధనపై గర్వం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment