అమరావతి...బిజెపి మూల సిద్ధాంతం అందించడానికి ప్రశిక్షణ మండల స్థాయిలో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్లో భాగంగా జోనల్ వారీగా నిర్వహించిన ప్రశిక్షకుల శిక్షణా తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి.
త్వరలో చేపట్టనున్న మండల స్థాయి ప్రశిక్షణా కార్యక్రమాల పూర్వ తయారీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రశిక్షణ కమిటీతో, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ Madhukar Nukala గారు సమీక్ష సమావేశం నిర్వహించారు
సంఘటిత శక్తితో, సిద్ధాంత బలంతో, సేవా భావంతో పార్టీ బలోపేతం దిశగా ముందుకు అడుగు వేయాలని సమీక్ష సమావేశం లో మాధవ్ పేర్కొన్నారు.మండల స్థాయిలో ప్రశిక్షణ కోసం ముందు గా ప్రణాళిక లు రచించుకుని తేదీలు ఖరారు చేసుకోవాలన్నారు. సమీక్ష లో రాష్ట్ర ప్రశిక్షణ బృందం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కోడూరి లక్ష్మీనారాయణ,ఓబిసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్, ఐటి సెల్ ఇంఛార్జి శివా మకుటం,గాలిపుష్ఫలత తదితరులు పాల్గొన్నారు


Comments
Post a Comment