Skip to main content

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు… కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వాగతం* *▪️ ప్రజలపై భారం తగ్గించడంలో మోదీ దృఢ సంకల్పం… చంద్రబాబు మద్దతుతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

అమరావతి, మార్చి 27:* పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారం తగ్గించేలా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రజా సంక్షేమ నిబద్ధతకు, దూరదృష్టి నాయకత్వానికి స్పష్టమైన నిదర్శనమని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిడి పెరుగుతున్న సమయంలో అనేక దేశాలు ఆ భారం ప్రజలపై మోపుతున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాలను ముందుంచి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవడం ఎన్డీయే ప్రభుత్వ ప్రజాకేంద్రిత పాలనను ప్రతిబింబిస్తోందన్నారు. సవాళ్ల సమయంలో నాయకత్వం అసలైన శక్తి బయటపడుతుందని, అలాంటి సందర్భాల్లో మోదీ గారి నిర్ణయాలు దేశానికి స్థిరత్వం, విశ్వాసం తీసుకువస్తున్నాయని పల్లా గారు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పల్లా గారు ప్రశంసిస్తూ, ప్రజల సంక్షేమం మరియు ఆర్థిక సమతుల్యతను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లగల దూరదృష్టి, పరిపాలనా అనుభవం ఆయనదేనన్నారు. కేంద్రం తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలను వెంటనే స్వాగతిస్తూ, రాష్ట్ర ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా స్పందించడం చంద్రబాబు గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో ప్రజలపై భారం తగ్గిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వమని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వ పరిపాలన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...