Skip to main content

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ...

అల్లవరం, విశాఖ సందేసం అల్లవరం మండలంలో పరిధిలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవగుప్తం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామంతకుర్రు, గురుకుల పాఠశాల (బాలురు)గోడి, గురుకుల పాఠశాల (బాలికలు) గోడి నందు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ మరియు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో  బుధవారం  పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. పరీక్ష కిట్లను ట్రస్ట్ ల  అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు,మోసుగంటి.వెంకటేశ్వరరావు  విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.ట్రస్టు అధ్యక్షులు వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ఇష్ట పడి కష్టపడి బాగా చదువుకుని ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని, పాఠశాలలకు, గ్రామానికి, మండలానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన విద్యార్ధికి ఏభైవేలు, ద్వితీయ స్థానంనకు నలభై వేలు,తృతీయ స్థానంనకు ముఫ్ఫై వేలు రూపాయలు ప్రోత్సహాలుగా ప్రకటించారు.  పాఠశాలల   ప్రధానోపాధ్యాయులు ట్రస్టులు చేస్తున్న సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, యమ్.టి.వి.సుబ్బారావు, ముత్యాల ఆనంద నవీన్, కడలి శ్రీ సత్య సాయిబాబు,ఉమ,బత్తుల వెంకటలక్ష్మి, ముమ్మిడివరపు వెంకటేశ్వరరావు,కొప్పిశెట్టి శ్రీనివాస్, కొనుకు రాజకుమార్ మరియు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...