అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చవటపల్లి సత్యనారాయణ (80) బుధవారం దోపిడీకి గురయ్యారు. బ్యాంకులో రూ.20 వేల పింఛను సొమ్ము విత్ డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న ఆయనను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారు. ఇంటి వద్దకు చేరుకోగానే, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోతున్నట్లు నటించి సాయం కోరాడు. ఆయన కాపాడేందుకు వెళ్లగా,
మరో వ్యక్తి చాకచక్యంగా ఆయన జేబులోని నగదును తస్కరించి ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వ్యక్తి చాకచక్యంగా ఆయన జేబులోని నగదును తస్కరించి ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Post a Comment