Skip to main content

విశ్వవ్యాప్త సేవలు .. దేశ ప్రగతికి సోపానాలు* *కీర్తి ప్రతిష్ట లే ప్రతి ఒక్కరికి శాశ్వతం* *నిష్ణాతులకు విశ్వగురు అవార్డుల ప్రధానం* *సినీ నటుడు రాజీవ్ కనకాల తో పాటు..తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రముఖులు

జగదాంబ ... మార్చి 22సమాజంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ  వారి పరిధి మేరకు విశ్వవ్యాప్తంగా సేవలు అందించి దేశ ప్రగతికి సోపానముగా నిలవాలని విశాఖ నగర  పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్గ్చి అన్నారు.. ఆదివారం హోటల్ దసపల్లలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిష్ణాతులకు ఉగాది పర్వదిన సందర్భంగా విశ్వ గురు అవార్డులను అతిథిలు చేతుల మీదుగా ప్రధానం చేశారు.. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో  కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు.. ప్రతిరోజు ఒక్కరు.. ఒక్కరికైనా సహాయం అందించగలిగినప్పుడు దేశవ్యాప్తంగా

అది ఎంతోమందికి ఆపన్న హస్తంగా మారుతుందన్నారు.. వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ ఎంతోమందికి సహాయ పడుతున్న నిష్ణాతులను ఎంపిక చేసి వారందరినీ సత్కరించుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.. గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ వేర్వేరు రంగాల్లో నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి చేదోడు వాదోడుగా నిలిచే  సేవకులతో తాను పురస్కారం స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.. గౌరవ అతిధిలు 

.. ఐ ఆర్ ఎస్ కస్టమ్స్ అధికారి  రవిశంకర్ మలిశెట్టి.. తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మడి రామ్ కుమార్ లు మాట్లాడుతూ

నిరంతరం సమాజానికి సేవలందిస్తున్న అవార్డు గ్రహీతలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి ఇతరులకు సహాయ పడితే అది దేశ ప్రగతికి తోడ్పడుతుందన్నారు.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సీఈవో డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా అత్యున్నతమైన సేవకులకు విశ్వగురు అవార్డ్స్ ప్రతి ఏటా అందజేస్తున్నామన్నారు.. దేశవ్యాప్తంగా నిజమైన సేవకులు ఎక్కడ ఉన్నారో  అటువంటివారిని తమ సంస్థ సభ్యులు ద్వారా గుర్తించి  అవార్డులు అందజేస్తున్నామన్నారు.. తమ సంస్థ అవార్డులు స్వీకరించిన 

ఎంతోమంది సేవకులు నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పద్మశ్రీ ..పద్మ విభూషణ్ అవార్డులు కూడా స్వీకరించారన్నారు.. నిజమైన సేవకులను గుర్తించడమే తమ సంస్థ ఏకైక లక్ష్యం అన్నారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు కళాకారులు.. నటీనటులు ఉన్నతాధికారులు ఇలా ఎంతో మందిని విశ్వగురు అవార్డులతో సత్కరించారు.... ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...