Skip to main content

కోనసీమలో పలు పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు.... ప్రముఖ ఆలయాలకు పుష్కర శోభ....

అమలాపురం, విశాఖ సందేసం...వచ్చే ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభంకానున్న గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని డా. బిఆర్ అంబేద్కర్  కోనసీమ జిల్లా పరిధిలోని 21 ఆలయాల పునర్నిర్మాణనికి కోనసీమకు రూ. 23.79 కోట్ల పనులకు నిధులను ప్రభుత్వం  మంజూరు చేసింది. 

ఆదునికీకరణ, వసతుల కల్పనకు ప్రభుత్వం అంబేద్కర్  కోనసీమలో 21 ఆలయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో దేవాదాయ  శాఖ అదికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానంలో రూ.3 కోట్లు అన్న దానం హాలు, భక్తులకు గదుల నిర్మాణం. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశ్వేశ్వర, శ్రీ కేశవ స్వామి, అన్నపూర్ణ, కాలభైరవ ఆలయాలు, ముఖ మండప పునర్నిర్మాణాలకు రూ.1.65 కోట్లు కేటాయింపు. కాట్రేనికోన కుండలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో  వసతి గదులు, అన్నదాన భవనం, మరుగుదొడ్ల నిర్మాణం.అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 2 కోట్లు డార్మెటరీ, రథశాల నిర్మాణం, గుర్రాలక్క ఆలయ పునః  నిర్మాణం...మరింత అభివృద్ధి దిశగా ముక్తేశ్వరస్వామి (అయినవిల్లి), చెన్నకేశవ స్వామి (పి. గన్నవరం, పోతవరం), కోదండరాము, రామలింగేశ్వరస్వామి (కాట్రేని కోన, నడవపల్లి), మదనగోపాలస్వామి (కాట్రేనికోన, పల్లంకుర్రు), పట్టాభిరామ స్వామి (పామర్రు), ఉమాకొప్పేశ్వర స్వామి (కొత్తపేట, పలివెల) ఆలయాలు ఉన్నాయి.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...