విశాఖపట్నం : మురళీనగర్ ఎన్జీవో కాలనీలోని శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి కళావేదికలో గురువారం రాత్రి బీజేపీ ఓబీసీ మోర్చా విశాఖ జిల్లా మీడియా కన్వీనర్, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నిడుమోలు రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విశాఖ సందేశం సంపాదకులు కె.వి. శర్మను ముఖ్య అతిథులు ఉగాది పురస్కారంతో సత్కరించారు: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బీసీ నాయకుడు దువ్వారపు రామారావు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు, జనసేన నాయకుడు పసుపులేటి ఉషా కిరణ్.గాడీ అవార్డులతో ఇతర విద్యార్థులతో కలిసి సాధించిన తన విజయాన్ని ఆయన నాకు గుర్తు చేశారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment