ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగానికి సంబంధించిన అన్ని జోన్లలో ఉన్న ఈ ఆర్ పి లను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల మదింపు మొదలైన వాటి విషయాలలో అధికారులు ఆస్తులకు సంబంధించిన ప్లాను, దస్తావేజులు, ఆయా ప్రాంతాలు, ఆస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరపాలన్నారు. ఈ ఆర్ పి లో పెట్టుకున్న దరఖాస్తులకు సంబంధించి ఆస్తి పన్నుల తగ్గింపు, సర్దుబాట్లు, వడ్డీ మాపి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఈ ఆర్ పి దాఖలు చేసిన ఆర్జీదారుడు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించిన పిదప మాత్రమే వాటిని పరిగణనలోనికి తీసుకొని తగు ప్రక్రియ జరపాలని జోనల్ కమీషనర్లకు కమీషనర్ ఆదేశించారు.
అలాగే 2025-26 సంవత్సరంనకు సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు, సంబంధిత బకాయిలను వెంటనే వసూళ్లు చేసే ప్రక్రియ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమీషనర్లకు కమీషనర్ ఆదేశించారు.
పౌర సంబంధాల అధికారి జివిఎంసి

Comments
Post a Comment