అమలాపురం, విశాఖ సందేసం వైద్య ఖర్చుల నిమిత్తం రీయింబర్స్మెంట్ కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న పలువురికి అమలాపురంలోని కార్యాలయంలో ఎంపీ హరీష్ బాలయోగి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 19 మంది లబ్ధిదారులకు 19,62,980/- (పందొమ్మిది లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల యనభై రూపాయలు) లను అందజేశారు. వీరిలో 17 మందికి రీఎంబర్స్మెంట్ చెక్కులు, ఇరువురికి ఎల్ ఓ సి లను అందజేసినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారిని ఈ విధంగా ఆర్థికంగా ఆడుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఎంపీ హరీష్ మాధుర్ ధన్యవాదాలు తెలియజేశారు. 

అలాగే తమరిని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, సహకరించిన ఎంపీ హరీష్ బాలయోగి కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.


Comments
Post a Comment