ఈ ప్రయోగాత్మక నిలుపుదలని హరిశ్చంద్రపురం స్టేషన్లో ఈ రోజు ఉదయం 08.33 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ & పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ కె. అచ్చన్నాయుడు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు తదితర ప్రముఖులు ప్రారంభించారు
అలాగే, పాతపట్నం స్టేషన్లో ఈ ప్రయోగాత్మక నిలుపుదలని ఉదయం 11.51 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు, పాతపట్నం ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు తదితర ప్రముఖులు ప్రారంభించారు.
ఈ నిలుపుదల ఏర్పాటు వల్ల ఈ స్టేషన్లు మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు విశాఖపట్నం, భువనేశ్వర్ మరియు మధ్యలోని ఇతర గమ్యస్థానాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. స్థానిక రైల్వే వినియోగదారులు మరియు ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిలుపుదలని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, కనెక్టివిటీని పెంపొందించడం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించడం పట్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే కట్టుబడి ఉంది. ఈ ప్రయోగాత్మక నిలుపుదల పనితీరు మరియు ప్రయోజనాన్ని ప్రయాణికుల స్పందన మరియు ఆపరేషనల్ సాధ్యత ఆధారంగా కాలానుగుణంగా సమీక్షిస్తారు.
ఇతరంగా, 18525 బ్రహ్మపూర్–విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు మండాసా రోడ్ (MMS) స్టేషన్లో ఉదయం 10.38 గంటలకు ప్రయోగాత్మక నిలుపుదలని భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు మరియు పాలాస ఎమ్మెల్యే శ్రీమతి సిరిషా గౌతు సిరీష గారు అందించారు.
ఈ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము.

Comments
Post a Comment