Skip to main content

అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో అరుదైన పాంక్రియాటైటిస్ సర్జరీ… కోనసీమ ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకోవాలి- మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ

 అమలాపురం, విశాఖ సందేసం...పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన 54 సంవత్సరాల చిట్టిబాబు అనే వ్యక్తి సుమారు సంవత్సరం నుండి “క్రానిక్ ప్యాంక్రియాటైటిస్” వ్యాధి వల్ల వచ్చే నొప్పితో బాధపడుతున్నారు. ఆయన చాలా హాస్పిటల్స్ కి తిరిగినా తన సమస్యకి పరిష్కారం దొరకలేదని, చివరికి హైదరాబాద్ ఏ.ఐ.జీ హాస్పిటల్ కి రిఫర్ చేసారని, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేక ఆ రోగి, మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఉన్నారని ఎవరో చెపితే తెలిసుకొని ఆయనను సంప్రదించారు. డా.సుధీర్ ఆ రోగికి పరీక్షలు జరిపి, ఆయన క్లోమములో రాళ్లు ఏర్పడటం వలన నొప్పితో బాధ పడుతున్నారని గమనించారు.  రోగికి తాను శస్త్ర చికిత్స చేసి నయం చేస్తానని ధైర్యం చెప్పారు. ఈనెల 5వ తేదీన ఆ రోగికి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. సుధీర్, మరియు మత్తు వైద్యులు డా.సురేష్ లతో కూడిన వైద్య బృందం తగిన శస్త్రచికిత్స వియయవంతంగా చేసారు. ఆ రోగి అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో 6 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకొని 11వ తేదీ న సంతోషంగా ఇంటికి వెళ్లారు. డాక్టర్ సుధీర్ ఎం.ఎస్. జనరల్ సర్జరీ పీ.జీ.ఐ చండీగఢ్‌లో చదివి, ఏ.ఐ.ఎం.స్., న్యూ ఢిల్లీ నుండి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి ఎం.సి.ఎచ్. చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ సుధీర్  మాట్లాడుతున్నారు ఇక మీదట ఎలాంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా క్యాన్సర్ అయినా గాని ట్రీట్‌మెంట్ కోసం వైజాగ్ లేదా హైదరాబాద్‌ వెళ్ళవలసిన అవసరం లేదని, అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కోనసీమ ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ కోరారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...