Skip to main content

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు *మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్* విశాఖపట్నం ఆధ్వర్యంలో *“పర్పుల్ రైడ్”* అనే ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు *మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్*  విశాఖపట్నం ఆధ్వర్యంలో *“పర్పుల్ రైడ్”* అనే ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని *లైఫ్ ఇన్‌ఫ్రా* మరియు *ఆర్‌ఎస్‌ఏ మోటార్ పార్క్* సంస్థల సహకారంతో నిర్వహించారు. ఈ ర్యాలీలో 300 మందికి పైగా మహిళలు, రైడర్లు, వాలంటీర్లు, విద్యార్థులు మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ ర్యాలీ *మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్,* ఆరిలోవ  నుండి ప్రారంభమై అడవివరం వరకు కొనసాగింది. “మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది” అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *విశాఖపట్నం సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డి. మేరీ ప్రసాంతి* హాజరై మహిళల కోసం ₹10,000 విలువైన క్యాన్సర్ ఆరోగ్య పరీక్ష కూపన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. రవికిరణ్ (సెంటర్ హెడ్) తో పాటు మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు  డా. సాహిత్య, డా. లలిత  స్వర్ణ, డా. రమావత్ దేవ్,  డా. కార్తీక్ చంద్ర  వల్లమ్,   డా.  విద్య  సాగర్   పాల్గొని మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

*ప్లాటిపస్ ఫౌండేషన్*, విశాఖపట్నం  కేంద్రంగా పనిచేస్తున్న ఒక మెరైన్  కన్సర్వేషన్  NGO, సమాజ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల పట్ల తన విస్తృత కట్టుబాటులో భాగంగా ఈ కార్యక్రమానికి మద్దతు అందించింది.

అమృత నర్సింగ్ కాలేజ్* విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగా, *ప్లాటిపస్ ఫౌండేషన్* మరియు *పసిడి జ్యువెలర్స్* సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు అందించాయి. మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకొని నియమిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు సూచించారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...