అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు *మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్* విశాఖపట్నం ఆధ్వర్యంలో *“పర్పుల్ రైడ్”* అనే ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు *మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్* విశాఖపట్నం ఆధ్వర్యంలో *“పర్పుల్ రైడ్”* అనే ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని *లైఫ్ ఇన్ఫ్రా* మరియు *ఆర్ఎస్ఏ మోటార్ పార్క్* సంస్థల సహకారంతో నిర్వహించారు. ఈ ర్యాలీలో 300 మందికి పైగా మహిళలు, రైడర్లు, వాలంటీర్లు, విద్యార్థులు మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ర్యాలీ *మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్,* ఆరిలోవ నుండి ప్రారంభమై అడవివరం వరకు కొనసాగింది. “మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది” అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *విశాఖపట్నం సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డి. మేరీ ప్రసాంతి* హాజరై మహిళల కోసం ₹10,000 విలువైన క్యాన్సర్ ఆరోగ్య పరీక్ష కూపన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. రవికిరణ్ (సెంటర్ హెడ్) తో పాటు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డా. సాహిత్య, డా. లలిత స్వర్ణ, డా. రమావత్ దేవ్, డా. కార్తీక్ చంద్ర వల్లమ్, డా. విద్య సాగర్ పాల్గొని మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.*ప్లాటిపస్ ఫౌండేషన్*, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఒక మెరైన్ కన్సర్వేషన్ NGO, సమాజ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల పట్ల తన విస్తృత కట్టుబాటులో భాగంగా ఈ కార్యక్రమానికి మద్దతు అందించింది.
అమృత నర్సింగ్ కాలేజ్* విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగా, *ప్లాటిపస్ ఫౌండేషన్* మరియు *పసిడి జ్యువెలర్స్* సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు అందించాయి. మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకొని నియమిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు సూచించారు


Comments
Post a Comment