Skip to main content

పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. *క్లాప్ వాహనాలపై విజిల్స్ సౌండ్ తప్పనిసరిగా అమర్చాలి. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ .

 

విశాఖపట్నం మార్చ్ 2: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో అశ్రద్ధ వహించకుండా రోడ్లు, కాలువలు, ఫుట్పాత్ లు నిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రతి ఇంటి నుండి వ్యర్ధాల సేకరణకు వచ్చే క్లాప్ వాహనాల రాకపోకలను గమనించేందుకు ప్రజల అవగాహన కొరకు క్లాప్  వాహనాలకు విజిల్స్ సౌండ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చి అమలు చేయాలని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నార్త్ జోన్ 42వ వార్డు పరిధిలోని రైల్వే న్యూ కాలనీ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం వహించకుండా ఎప్పటి చెత్తను అప్పుడే తొలగించే చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య అధికార్లను ఆదేశించారు. తాటిచెట్లపాలెం, న్యూ కాలనీ తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడం గమనించి, ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగిస్తున్నప్పటికీ మరల యధా స్థితిలో ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని సౌత్, నార్త్ జోనల్ కమిషనర్లను కమీషనర్ వాకిటాకీ ద్వారా ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరిస్తున్న క్లాప్ వాహనాలపై విజిల్ సౌండ్ లేనందున ప్రజలకు చెత్త తీసుకెళ్లే వాహనం వచ్చిందని ఎలా తెలుస్తుందని , ప్రజలు క్లాప్ వాహనాలను గమనించేందుకు  తప్పనిసరిగా ప్రతి క్లాప్ వాహనానికి విజిల్స్ సౌండ్స్ సిస్టమ్ అమర్చి వినియోగించేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ను వాకిటాకీ ద్వారా ఆదేశిస్తూ పారిశుద్ధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో వార్డు శానిటేషన్ కార్యదర్శులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు .

పౌర సంబంధాల అధికారి,జివిఎంసి


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...