Skip to main content

స్థలము వివాదంలో న్యాయం చేయండి బాధితుడు

విశాఖపట్నం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధి విశాలాక్షి నగర్ వెటర్నరీ కాలనీ లో గల ఒక లే అవుట్ వద్ద స్థలం వివాదం నెలకొంది. ఇక్కడి స్థలం విషయమై రెండు వర్గాలు గొడవ పడ్డాయి. బాదితుడు.... ఆదివారం మీడియాతో మాట్లాడుతూ,

విశాఖ రూరల్ పరిధి 

చినగదిలీ సర్వే నంబరు 134 లో ఈ స్థలం ఉందని గుర్తు చేశారు. 1960వ సంవత్సరంలో ఊరుమిటి అప్పల స్వామి చే ఈ స్థలం కొనుగోలు చేయబడిందన్నారు. కాగా,

1970లో సుబ్బరాజు చే ఇక్కడ లేఅవుట్ రూపొందించబడిందన్నారు. ఇక్కడ మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. అప్పల స్వామి ఈ స్థలాలు కొనుగోలు చేసిన వారి పేరిట రిఃస్ట్రేషన్ లు చేశారాని స్పష్టం చేశారు.

ఉరిమిటి అప్పలస్వామిచే 6.70 ఎకరాలు కొనుగోలు చేయబడిందన్నారు. ఈ స్థలం ఆక్రమణ కు 

గోర్లే లక్ష్మి  దౌర్జన్యం చేస్తున్నారని గుర్తు చేశారు.

యలమంచిలి గ్రామానికి చెందిన....గొర్లె లక్ష్మి తప్పుడు సర్వే నంబరు 143/1 తో డాక్యుమెంట్ లో తప్పుగా నమోదు చేయబడింది అని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్ బీచ్ రోడ్డు లో వుంది అని అయన పేర్కొన్నారు. ఆమె తప్పుడు డాక్యుమెంట్లు చూపించి ఇక్కడి స్థలంలో నిర్మాణాలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 8 న ఆరిలోవ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విశాఖ రూరల్ తహసీల్దార్ కి రిపోర్ట్ రాశారు అన్నారు. తహసీల్దార్ రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉండగానే ఆమె నిర్మాణం చేపట్టడం అన్యాయం అన్నారు.

ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...