జీవీఎంసీలో ఘనంగా అమరజీవి జయంతి వేడుకలు. *పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం. - నగర మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేనవని చరిత్రలో ఎన్నటికీ నిలిచి ఉంటాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి రమణమూర్తి, పి.నల్లనయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను ఎంచుకొని హరిజనోద్ధరణ ఆశయ సాధన కొరకు జీవితాంతం కృషి చేశారని, భాషాపరంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమని అందుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను ఆంధ్ర రాష్ట్ర కోసం అర్పించారని తెలిపారు. ఆయన చేసిన కృషికి చిహ్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో 6.8 ఎకరాలలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నేడు ప్రారంభించారని తెలిపారు. ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరించడం తెలుగువారి ఆత్మగౌరవానికి, నిరంతర స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను ఎంచుకొని హరిజనోద్ధరణ ఆశయ సాధన కొరకు జీవితాంతం కృషి చేశారని, భాషాపరంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమని అందుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను ఆంధ్ర రాష్ట్ర కోసం అర్పించారని తెలిపారు. ఆయన చేసిన కృషికి చిహ్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో 6.8 ఎకరాలలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నేడు ప్రారంభించారని తెలిపారు. ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరించడం తెలుగువారి ఆత్మగౌరవానికి, నిరంతర స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయ భారతి, సిసిపి ఏ ప్రభాకర్ రావు, డిసిఆర్ శ్రీనివాసరావు, జీవీఎంసీ ప్రధాన పైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, కార్యదర్శి బివి రమణ, ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ సి వాసుదేవ రెడ్డి, హార్టికల్చర్ అధికారి వాసుకి, ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, సిటీ వెటర్నరీ ఆఫీసర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment