విశాఖపట్నం, మార్చి 8:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు (08-03-2026) ఉదయం 7:00 గంటలకు విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద “పింక్ సఖి సారీ వాక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ పై మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి మరియు క్యాన్సర్ విజేత గౌతమి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది కలిసి సుమారు 300 మంది మహిళలు పింక్ రంగు చీరలు ధరించి ఈ వాక్లో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హారిక తన బృందంతో కలిసి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి మరియు క్యాన్సర్ విజేత గౌతమి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది కలిసి సుమారు 300 మంది మహిళలు పింక్ రంగు చీరలు ధరించి ఈ వాక్లో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హారిక తన బృందంతో కలిసి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.

Comments
Post a Comment