Skip to main content

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి : విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి

వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకు అందేలా పర్యవేక్షణ మరింత బలోపేతం కావాలని సూచించారు.కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ పాండే సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్,జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు తనూజ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు, ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన ఏఎఫ్‌సీ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ సంఘసేవకుడు కమల్ బైద్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహుకరించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...