పుట్టా మహేష్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి: మాజీ ఎంపీ చింతా అనురాధ... డ్రగ్స్ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం...
డ్రగ్స్ను కట్టడి చేస్తామని చెప్పే టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని చింతా అనురాధ ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తిగా అరికడతామని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమె నిలదీశారు. స్వయంగా టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడటం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని ఘటనని పేర్కొన్నారు.
గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తీసుకునే వ్యక్తికి పార్లమెంట్లో చోటు ఉండదని, వెంటనే ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని పుట్టా మహేష్ను డిమాండ్ చేశారు. అలాగే ఆయనను వెంటనే టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనురాధ డిమాండ్ చేశారు.ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారి రాష్ట్ర పరువును దిగజార్చిందని ఆమె అన్నారు. సొంత ఎంపీలు కూడా డ్రగ్స్ బానిసలుగా మారే పరిస్థితి వస్తే ఆ పార్టీ పాలన గురించి ప్రజలు ఏం అనుకోవాలని ఆమె ప్రశ్నించారు.టీడీపీ అంటే ఇప్పుడు “తెలుగు డ్రగ్స్ పార్టీ”గా పేరు మారిందని అనురాధ తీవ్రంగా విమర్శించారు. డ్రగ్స్ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైన ఈ కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఇందులో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ ప్రభావంతో కేసును దాచిపెట్టే ప్రయత్నాలు చేయకూడదని చింతా అనురాధ డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించే రాజకీయాలకు 2029 ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆమె హెచ్చరించారు.

Comments
Post a Comment