Skip to main content

సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విశాఖపట్నం, జ్ఞానపురం, మార్చి 7, 2026:జ్ఞానపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. మాణిక్య కుమారి నాయకత్వంలో “Give to Gain” అనే భావనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతను మరియు సమాజ అభివృద్ధిని ప్రోత్సహించే ఐదు ముఖ్య అంశాలను వివరించారు:

1. అవకాశాలు ఇవ్వండి – ఆవిష్కరణలను పొందండి

2. మద్దతు ఇవ్వండి – భవిష్యత్ నాయకులను పొందండి

3. సౌలభ్యం ఇవ్వండి – నిలకడ మరియు శ్రేయస్సును పొందండి

4. స్వరం ఇవ్వండి – బలమైన బృందాలను పొందండి

5. సమాజానికి తిరిగి ఇవ్వండి – బలమైన సమాజాలను నిర్మించండి

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులకు మహిళలకు అవకాశాలు కల్పించడం, వారికి మద్దతు ఇవ్వడం ద్వారా సమానత్వం మరియు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026కు ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నిర్ణయించిన థీమ్ “అందరు మహిళలు మరియు బాలికల కోసహక్కులు. న్యాయం. చర్య.”  ఈ థీమ్ మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు మరియు వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. అలాగే మహిళలకు న్యాయం, సమానత్వం కల్పించడానికి బాధ్యతతో కూడిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రాధాన్యతగా ప్రస్తావిస్తుంది. ఈ సంవత్సరం ప్రచారంలో ఉన్న మరో ముఖ్య హ్యాష్‌ట్యాగ్ #గివ్‌టుగెయిన్, మహిళా సాధికారత ద్వారా సమిష్టి అభివృద్ధిని సాధించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా అధ్యాపకులు మరియు విద్యార్థినులు మనస్పూర్తిగా ఇచ్చే సేవా భావాన్ని ప్రతిబింబించే స్టిల్స్ ప్రదర్శించి ఈ ఏడాది మహిళా దినోత్సవం లక్ష్యాన్ని ప్రచారం చేశారు. కళాశాల విద్యార్థి మండలి అందరు ఉపాధ్యాయులకు చిన్న బహుమతులు అందజేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...