Skip to main content

ప్రియురాలిని హతమార్చి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ టెక్నీషియన్!* *విశాఖలో దారుణం..* *పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..*

విశాఖపట్నం మార్చి30 టైమ్స్ పవర్*నగరంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్, ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి మౌనిక (29) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి అతను మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.

ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫ్రిజ్‌లో ఉన్న మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మౌనిక తల కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...