Skip to main content

జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం. -విశాఖ నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు.

నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అందరూ స్థాయి సభ్యులతో, జీవీఎంసీ అధికారులతో కలిసి స్థాయి సంఘo సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన ఎజెండాలో 193  అంశాలు, 101 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 294 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి ప్రధాన అజెండాలోని  అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని, టేబుల్ అజెండాలో 101 అంశాలలో ఒక అంశం వాయిదా వేయగా మిగిలినవి ఆమోదించడం జరిగిందని మొత్తంగా  294 అంశాలలో 293 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని స్థాయి సంఘం చైర్పర్సన్ తెలిపారు.అనంతరం స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ మేయర్ గా , స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గా తను పదవిని చేపట్టిన నాటి నుండి విశాఖ నగర అభివృద్ధి దిశగా, అన్ని వార్డులలో ప్రజలకు కల్పించవలసిన మౌలిక వసతులు, రోడ్లు,కాలువలు, ఫుట్ పాతులు నిర్మాణాలు, మరమ్మత్తులు తదితర అభివృద్ధి పనులను కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సభ్యుల సహకారంతో మంజూరు చేసి విశాఖ నగర అభివృద్ధికి కృషి చేశామన్నారు. సహకరించిన జీవీఎంసీ కమిషనర్లకు, అధికారులకు, ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్ కాలం ముగిసిన తర్వాత కూడా వార్డులలో ప్రజల సమస్యలపై సభ్యులు సమర్పించబోవు రిప్రెజెంటేషన్లను పరిగణనలోనికి తీసుకొని జీవీఎంసీ అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించేలా సహకరించాలని చైర్ పర్సన్ అధికారులను కోరారు.

ఈ సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, కార్యదర్శి బివి రమణ, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్ శ్రీనివాసరావు,జోనల్ కమిషనర్లు,ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎ.ఎమ్.ఒ.హెచ్ లు, , రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ పరిపాలన విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జివిఎంసి.



Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...