అల్లవరం, విశాఖ సందేసం...డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో స్నానం చేస్తుండగా యువకుడు గల్లంతు అయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అమలాపురం నారాయణపేట చెందిన నలుగురు యువకులు బొక్కా సతీష్, గుత్తుల మనోజ్, బొక్కా గణేష్, దొమ్మేటి లోకేష్ లు ఒడలరేవు సముద్ర తీరంలో రక్షణ గ్రోయిన్స్ నిర్మాణం చేస్తున్నా ప్రదేశంలో స్నానం చేస్తుండగా ప్రమాదవసాత్తు విద్యార్థి దొమ్మేటి లోకేష్ గల్లంతు

మిగిలిన ముగ్గురు స్నేహితులు సురక్షితంగా ఒడ్డుకి చేరుకోగా లోకేష్ గల్లంతు కావడంతో స్నేహితులలో ఆందోళన నెలకొని స్థానికులు సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అల్లవరం ఎస్.ఐ సంపత్ కుమార్ పోలీసు సిబ్బంది, మెరైన్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా సముద్రతీరంలో గజ ఈతగాళ్ళు సాయంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమారుడు సముద్రంలో గల్లంతు అవ్వడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నిరయ్యారు.

Comments
Post a Comment