విశాఖపట్నం మార్చి 5: వార్డులలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్యం పనులను నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గాజువాక జోన్ 73, 72, 66 వార్డుల పరిధిలోని వంటిల్లు, కణితి రోడ్డు ప్రాంతాలు , అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 73వ వార్డు వంటిల్లు వద్ద పారిశుధ్యం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమర్షియల్ వాహనాల పనితీరును అడిగి తెలుసుకుని, క్లాప్ వాహనాలపై ప్రజల అవగాహన కొరకు జింగిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆ మార్గంలో వెళ్తున్న క్లాప్ వాహనం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకపోవడంపై తగిన చర్యలు చేపట్టాలని సహాయక వైద్యాదికారి డాక్టర్ కిరణ్ కుమార్ ను కమిషనర్ ఆదేశించారు. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, సెల్లార్ ఫ్లోర్లలో ఆక్రమణలను తొలగించాలని జోనల్ కమిషనర్ బి ఆర్ ఎస్ శేషాద్రి ను ఆదేశించారు. అన్న క్యాంటీన్ వద్ద పారిశుద్ధ్య పనులు క్యాంటీన్ నిర్వహణ మొదలైనవి పరిశీలించి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లలో నాణ్యతతో భోజనం అందించాలని అలాగే అన్న క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కణితి రోడ్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పాన్ షాప్ ను పరిశీలించి డస్ట్ బిన్లో వ్యర్ధాలు వేసేలా చూడాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాయగూర వ్యర్ధాలు కాలువలో పడవేయడాన్ని గమనించి వాటి నియంత్రణా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో ఆస్తి పన్నుల విధింపు, వసూళ్ళకు సంబంధించి లైన్ లిస్టింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని వార్డు సచివాలయం కార్యదర్శులను, పలు దుకాణాలలో ఆస్తి పన్నులు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే వారు చెల్లించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అలాగే జంక్షన్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 73వ వార్డు వంటిల్లు వద్ద పారిశుధ్యం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమర్షియల్ వాహనాల పనితీరును అడిగి తెలుసుకుని, క్లాప్ వాహనాలపై ప్రజల అవగాహన కొరకు జింగిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆ మార్గంలో వెళ్తున్న క్లాప్ వాహనం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకపోవడంపై తగిన చర్యలు చేపట్టాలని సహాయక వైద్యాదికారి డాక్టర్ కిరణ్ కుమార్ ను కమిషనర్ ఆదేశించారు. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, సెల్లార్ ఫ్లోర్లలో ఆక్రమణలను తొలగించాలని జోనల్ కమిషనర్ బి ఆర్ ఎస్ శేషాద్రి ను ఆదేశించారు. అన్న క్యాంటీన్ వద్ద పారిశుద్ధ్య పనులు క్యాంటీన్ నిర్వహణ మొదలైనవి పరిశీలించి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లలో నాణ్యతతో భోజనం అందించాలని అలాగే అన్న క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కణితి రోడ్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పాన్ షాప్ ను పరిశీలించి డస్ట్ బిన్లో వ్యర్ధాలు వేసేలా చూడాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాయగూర వ్యర్ధాలు కాలువలో పడవేయడాన్ని గమనించి వాటి నియంత్రణా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో ఆస్తి పన్నుల విధింపు, వసూళ్ళకు సంబంధించి లైన్ లిస్టింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని వార్డు సచివాలయం కార్యదర్శులను, పలు దుకాణాలలో ఆస్తి పన్నులు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే వారు చెల్లించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అలాగే జంక్షన్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు
పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ.
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment