Skip to main content

*▪️ పేదల సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం… టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఘనంగా అందజేత* *▪️ చంద్రబాబు సంకల్పం ఫలించింది… టిడ్కో ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగు* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

విశాఖపట్నం, మార్చి 30:* రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం పరిధి లో తలారువానిపాలెంలో టిడ్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విశాఖపట్నం ఇంచార్జ్ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మరియు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. ఈ సందర్భంగా గాజువాకలో 1393 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. గతేడాది తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, ఇప్పుడు రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా గత 21 నెలల కాలంలోనే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ పనితీరు, సంకల్పబలం స్పష్టంచేస్తోందన్నారు.

2019 నాటికే పూర్తయిన ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసి, కేవలం రంగులు మార్చే పేరుతో సుమారు రూ.300 కోట్లు దుర్వినియోగం చేసిందని పల్లా గారు ఆరోపించారు. మౌలిక వసతులు కల్పించకుండా, సిమెంట్ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, ఎస్‌టీపీ వంటి అవసరాలను పట్టించుకోకుండా ఇళ్లను ఖాళీగా ఉంచడం వైసీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులను మభ్యపెట్టి ఇళ్లను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు సమీకరించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి గృహాలకు జీవం పోసిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యంతో పేదల గృహ కలను సాకారం చేస్తోందన్నారు. సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగే పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.


రాబోయే రోజుల్లో మరింత వేగంతో గృహ నిర్మాణం, పంపిణీ కార్యక్రమాలను విస్తరిస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...