ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ప్రాంగణంలో ఏపీ జేఏసీ మరియు ఏపీ ఆర్ ఎస్ ఏ వారి ఆధ్వర్యంలో జరిగాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు శ్రీ ఎం.ఎన్. హరీంధర్ ప్రసాద్ ఐఏఎస్ గారు వారి సందేశంలో సృష్టిలో మహిళ లేకుండా సృష్టి లేదని మహిళ యొక్క పాత్ర సమాజంలో ఎంతో ఉన్నతమైనదని తెలియజేశారు ఇంటిలో తల్లిగా విద్యాలయాల్లో ఉపాధ్యాయురాలుగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వారు ఉద్యోగ జీవితాల్లో కూడా ఎంతో నిబద్దతో పనిచేస్తూ ప్రతి రంగాలలో వారి యొక్క ఉన్నతిని చాటుతున్నారని అటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఉన్నారు.
ఉద్యోగ జీవితంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించవలెనని మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఎంతో విజయవంతంగా సాగుతుందని తెలియజేశారు. 
ఉద్యోగ జీవితంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించవలెనని మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఎంతో విజయవంతంగా సాగుతుందని తెలియజేశారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ వారు, జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీమతి శేష శైలజ గారు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు శ్రీ సత్తి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏ.పి.ఆర్.ఎస్.ఏ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు శ్రీ యస్.ఎ.త్రినాధ్ రావు గారు, కార్యదర్శి శ్రీ పేర్లి శ్యాంప్రసాద్ గారు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారిని శ్రీమతి బి.వి.రాణి గారు, ఏపీ జేఏసీ మహిళ ఛైర్ పర్సన్ శ్రీమతి శైలజ పాణిగ్రహి గారు పాల్గొని ఉన్నారు.

Comments
Post a Comment