Skip to main content

ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం కోసం రంజాన్ ప్రార్థనలు* *ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణతో సమాజ శ్రేయస్సుకు మార్గం చూపే పవిత్ర మాసం* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

విశాఖపట్నం, మార్చి 21:* ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గాజువాక ఈద్గా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొని ముస్లిం సోదరులతో ఆత్మీయంగా కలిసిమెలిసి పండుగ ఆనందాలను పంచుకున్నారు.

రంజాన్ మాసం ఆధ్యాత్మిక శుద్ధి, ఆత్మ నియంత్రణ, సహనం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ద్వారా శరీరం, మనస్సు, ఆత్మలను నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో జీవించాల్సిన అవసరాన్ని ఈ పవిత్ర మాసం గుర్తుచేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రంజాన్ మాసం ప్రతి మనిషిలో స్వీయ నియంత్రణ (Self Control), క్రమశిక్షణ (Self Discipline), దయ, సహానుభూతి వంటి విలువలను పెంపొందించే మహత్తర సాధనమని పేర్కొన్నారు. వ్యక్తి తనలోని లోపాలను జయించి, మంచి ఆలోచనలు అలవర్చుకుంటేనే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు.

ప్రపంచంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలనతో పాటు ఆత్మ నియంత్రణను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పల్లా స్పష్టం చేశారు. రంజాన్ మాసం అదే సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...