జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు*
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 02-03-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లిక్కర్ స్కాం కు పాల్పడిన ముఖ్య సూత్రధారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్. బీజేపీ రాష్ట్ర ST మోర్చా ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లంక శ్రీరామ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments
Post a Comment