భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు
విశాఖపట్నం 06-03-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు జరుగుతున్న జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.
కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశురామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్, జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావు , బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Comments
Post a Comment