Skip to main content

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ సమక్షంలో బిజెపిలోకి చేరికలు*


ఈరోజు 28-03-2026 శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి విశాఖ పట్నం జిల్లా కార్యాలయంలో 
జిల్లా అధ్యక్షులు MMN పరశురామరాజు ఆధ్వర్యంలో  వైసిపి సీనియర్ నాయకులు నైదాన శివ శేఖర్ భారతీయ జనతా పార్టీ లోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు పార్టీ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ బొత్సా సురేష్ కుమార్, బీజేపీ శివాజీపాలెం మండల అధ్యక్షులు విఠల్ ధనరాజ్ నాయక్ మరియు అధిక సంఖ్యలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...