Skip to main content

జాబ్ క్యాలెండర్ విడుదలపై విశాఖలో నిరుద్యోగుల ఘన విజయోత్సవ ర్యాలీ 'Thank You Nara Lokesh Sir' అంటూ నినాదాలు..

జాబ్ క్యాలెండర్ అవకాశాన్ని కష్టపడి చదివి సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ వేపాడనిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై నిరుద్యోగులు ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం తదితరులు పాల్గొన్న ఈ ర్యాలీలో నిరుద్యోగులు 'Thank you Lokesh Sir' అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఎంవీపీ కాలనీలో నిర్వహించిన ఈ ర్యాలీ అనంతరం ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత బాధలను యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా విన్నారని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వివిధ శాఖల్లో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చారిత్రిక ఘట్టమని అన్నారు.యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, కేంద్రంలో UPSC మాదిరిగా రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో నారా లోకేశ్ కృషి అభినందనీయమన్నారు. టీచర్లు, లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, కానిస్టేబుల్స్, ఎస్సై పోస్టులు, జైలు వార్డర్లు, హాస్టల్ వార్డెన్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు, ఏఎస్వోలు (ASOs), లైబ్రేరియన్లు, గ్రూప్-1, గ్రూప్-2 వంటి అనేక విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆశావహులకు సువర్ణావకాశమని పేర్కొన్నారు.ఈ ఖాళీలను సంవత్సరంలోనే భర్తీ చేసి, వచ్చే ఉగాదికి మరో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా కలిగించే అభినందనీయ చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయడం, అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేశారు.


అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్‌ను తమ జీవితాలను మార్చే గొప్ప అవకాశంగా మలుచుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. ఇది ముగింపు కాదు... సరికొత్త ఆరంభం మాత్రమేనని ప్రభుత్వ విప్ వేపాడ పిలుపునిచ్చారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...